Month: August 2024

హైదరాబాద్ లో భారీ సైబర్ క్రైమ్ కుంభకోణం… ఏంటంటే… వివరాల్లోకి వెళ్ళితే…

హైదరాబాద్ కేంద్రంగా భారీగా సైబర్ క్రైమ్ కుంభకోణం పాల్పడిన ట్లు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ నేర గాళ్లకు సహకరించిన ఇద్దరు బ్యాంకు నుంచి రూ. 175 కోట్లు లావాదేవీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో. ఎన్‌సిఆర్…

TG : పంచాయతీ ఎన్నికలు అప్పుడే: సీఎం క్లారిటీ

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను నియమించి రిజర్వేషన్లు ఖరారు చేస్తామని తెలిపారు. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఆరు రోజుల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం…

షేక్ హసీనాపై మరో 4 మర్డర్ కేసులు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ప్రస్తుత ఆ దేశ ప్రభుత్వం మరో 4 మర్డర్ కేసులు నమోదు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇప్పటికే ఆమెపై 55 కేసులను ఆ దేశ సర్కార్ పెట్టగా.. అందులో 44 మర్డర్ కేసులు…

నారింజ పండు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు

రోజూ ఒక నారింజ పండు తింటుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆహార నిపుణులు అంటున్నారు. దీనివల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. నారింజలో కేలరీలు తక్కువ, ఫైబర్ అధికంగా ఉంటుంది. రోజూ తింటే బరువు తగ్గవచ్చు. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది…

అనిల్ అంబానీ కార్యకలాపాలపై సెబీ నిషేధం

స్టాక్ మార్కెట్‌లో అనిల్ అంబానీ కార్యకలాపాలపై సెబీ నిషేధం విధించింది. నిధులు మళ్లింపు వ్యవహారంలో అనిల్‌పై సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లపాటు అనిల్ అంబానీ కార్యకలాపాలపై నిషేధం విధించింది. అనిల్ అంబానీకి చెందిన 24 సంస్థలపైనా సెబీ నిషేధం విధించడంతో…

యువత తగ్గి… వృద్ధులు పెరిగి…!

దేశ జనాభాలో 15 ఏళ్లలోపు బాలల శాతం 2036 నాటికి గణనీయంగా తగ్గి 60 ఏళ్లు పైబడినవారి జనాభా పెరగనుంది. దేశ జనాభా 140 కోట్లు కాగా 2036 నాటికి 152.20 కోట్లకు చేరనుంది. ఈ మేరకు దేశ జనాభా పెరుగుదలపై…

జమ్మూకశ్మీర్ BJP ఎన్నికల ఇన్ఛార్జులుగా ఎవరంటే

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జులుగా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్లను BJP అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు.…

AP : రాష్ట్ర బడ్జెట్ పై కసరత్తు ప్రారంభం

రాష్ట్రంలో 2024-25ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ తయారీకి కసరత్తు ప్రారంభమైంది. నవంబరు నెలాఖరులోపు పూర్తిస్థాయి బడ్జెట్ కు ఆమోదం తీసుకోవాల్సి ఉంది. అయితే అంతకన్నా ముందే రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే ఆస్కారం ఉంది. తొలుత అన్ని ప్రభుత్వశాఖల నుంచి…

రైలింజన్ లలో ఏఐ సీసీటీవీ కెమెరాలు

దేశంలో పెరుగుతోన్న రైలు ప్రమాదాలను నియంత్రించేందుకు రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని లోకోమోటివ్లు(రైలు ఇంజిన్లు), ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో కృత్రిమ మేథ(ఏఐ) పరిజ్ఞానంతో కూడిన సీసీటీవీ కెమెరాలను అమర్చనున్నట్లు రైల్వే బోర్డు ఛైర్పర్సన్, సీఈవో జయవర్మ సిన్హా వెల్లడించారు.…

నా తప్పు తెలిసింది: అమితాబ్

నటుడు అమితాబ్ బచ్చన్ తను డిగ్రీలో ఎంత ఉత్తీర్ణత సాధించారో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. “1962లో కిడోరి మాల్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశా. సైన్స్ లో బాగా స్కోర్ చేయొచ్చని డిగ్రీలో బీఎస్సీకి దరఖాస్తు చేశా. మొదటిసారి ఫెయిల్…

త్రిపురలో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి

భారీ వర్షాల కారణంగా త్రిపురలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అక్కడి నాలుగు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అందులో మొత్తం ఏడుగురు మృతి చెందారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. సౌత్ త్రిపుర జిల్లాలో ఐదుగురు, గోమతి, కోవై…

మంకీ పాక్స్ పై ఢిల్లీ ఎయిమ్స్ మార్గదర్శకాలు

ప్రపంచాన్ని వణికిస్తోన్న మంకీ పాక్స్ ఢిల్లీ ఎయిమ్స్ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. జ్వరం, దద్దుర్లతో వచ్చినవారిని ఇతర పేషంట్లతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంచాలంది. కండరాలు, నడుం నొప్పి, ఉబ్బిన నరాలు, వణుకుడు, అలసట, వెడల్పాటి దద్దుర్లను గుర్తించాలని పేర్కొంది.…

యూఏఈలో ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్!

ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 9వ ఎడిషన్ యూఏఈలో నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ లో ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉంది. కానీ ఇటీవల బంగ్లాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐసీసీ వేదికను మార్చింది. అక్టోబర్ 3…

చంద్రయాన్ 4, 5 డిజైన్లు పూర్తి: ఇస్రో

చంద్రయాన్ 4, 5 డిజైన్లు పూర్తి చేసినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ప్రభుత్వ ఆమోదం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. 2028లో చంద్రయాన్-4 ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. చంద్రుడి నుంచి మట్టి, రాళ్లు భూమికి తీసుకురావడమే లక్ష్యంగా పని…

కోల్ కత్తా హత్యాచార కేసులో సుప్రీం కీలక ఆదేశాలు

కోల్ కత్తా వైద్యురాలి హత్యాచార కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారంలోగా ఈ కేసుపై దర్యాప్తు అఫిడవిట్ ను దాఖలు చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీనియర్, జూనియర్ డాక్టర్ల భద్రతపై సిఫార్సులు…

‘క్యూట్’ ఛార్జీపై వివరణ ఇచ్చిన ఇండిగో

ప్రముఖ ఎయిర్ లైన్స్ ఇండిగోలో ‘క్యూట్’ ఫీజు కింద రూ.50 వసూలుచేయడం నెట్టింట విమర్శలకు దారితీసింది. కాగా.. దీనిపై ఇండిగో స్పందించింది. ఈ ఛార్జీలు ఎందుకో వివరణ ఇచ్చింది. “క్యూట్ అంటే కామన్ యూజర్ టర్మినల్ ఎక్విప్మెంట్ ఛార్జ్. సాధారణంగా ఎయిర్పోర్టుల్లో…

‘క్యూట్’ ఛార్జీలా?.. ఇండిగోకు ఓ నెటిజన్ ప్రశ్న

ఇండిగో టికెట్ ధరకు సంబంధించి ఓ ప్రయాణికుడు చేసిన పోస్ట్ నెట్టింట చర్చకు దారితీసింది. అందులో టికెట్ ఛార్జీలతో పాటు క్యూట్ ఫీజు, యూజర్ డెవలప్మెంట్ ఫీజు అంటూ ఇతరత్రా ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ శ్రేయాన్ష్సింగ్ అనే వ్యక్తి నెట్టింట పోస్ట్…

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో మరోసారి నిరాశే ఎదురైంది. లిక్కర్ స్కాం కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి సుప్రీంకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ఈడీకి…

మహారాష్ట్రలో సిమెంట్ వెల్లుల్లి

మహారాష్ట్రలోని అకోలాలో సిమెంట్తో తయారు చేసిన నకిలీ వెల్లుల్లి దర్శనమిచ్చింది. ఇప్పుడు దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వెల్లిగడ్డపై పొర మాత్రమే అలాగే ఉంచి లోపలంతా సిమెంట్ ను నింపి మార్కెట్లోకి వదులుతున్నారు. సిమెంట్తో చేసిన నకిలీ…

AP : గ్రామసభల నిర్వహణపై నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష

రాష్ట్రంలో గ్రామ సభల నిర్వహణపై డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ సోమవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు. ఈనెల 23న గ్రామ సభలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులతో మాట్లాడనున్నారు. వికసిత భారత్, ఆంధ్రప్రదేశ్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, గ్రామసభల…

AP : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను సోమవారం విడుదల చేయనున్నారు. ఈరోజు ఉదయం 10 నుంచి ఈనెల 21వ తేదీ ఉదయం 10 వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చని…

AP : నేడు 15 సంస్థలను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు సోమవారం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీలో పర్యటించన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శ్రీసిటీలో 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించడంతోపాటు మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం శ్రీసిటీ బిజినెస్…

AP : ప్రతి గిరిజన మండలానికి అన్న క్యాంటీన్: సీఎం

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు గుడివాడలో అన్న క్యాంటీన్లను పున: ప్రారంభించిన విషయం తెలిసిందే. గిరిజనులకు పౌష్ఠికాహారం అందుబాటులో ఉండేలా.. ప్రతి గిరిజన మండల కేంద్రంలో ఒక అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. దీంతో గిరిజనులకు తక్కువ…

TG : మహిళలకు క్షమాపణ చెప్పిన కేటీఆర్

ఉచిత బస్సు ప్రయాణంపై సెటైర్ వేయబోయి మహిళలపై అసభ్యకర కామెంట్ చేసిన కేటీఆర్ తన తప్పు తెలుసుకున్నారు. “నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా కామెంట్ చేశాను. వాటి వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్థాపం కలిగితే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను.…

AP : రూ.2,047 కోట్లతో అమరావతికి రైలు మార్గం

రాష్ట్ర రాజధాని అమరావతి రైలు మార్గం అనుసంధానం కోసం రూ.2,047 కోట్లతో 56 కిలోమీటర్ల రైల్వేలైన్ కు సంబంధించిన DPR (సవివర ప్రాజెక్టు నివేదిక)కు రైల్వేబోర్డు అమోదం తెలిపిన తర్వాత నీతి ఆయోగ్ ఆమోదముద్ర వేసిందని మండల రైల్వే అధికారి(DRM) రామకృష్ణ…

హడలెత్తించిన చెడ్డీ గ్యాంగ్

తిరుపతి జిల్లా, తిరుచానూరులో చెడ్డి గ్యాంగ్ అలజడి రేపింది. కొత్తపాళెం లే అవుట్లోని ఓ ఇంట్లో చొరబడి చోరీకి పాల్పడ్డారు. ప్రహరీ గోడ దూకి లోపలికి వచ్చి బీరువాలో దాచిన నగలు, నగదుతో పరారయ్యారు. బినియన్లు, చెడ్డీ ధరించి మారణాయుదాలతో ముగ్గురు…

TG: అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి

అనుమానాస్పద స్థితిలో చిరుతపులి మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని జాదరావుపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. తాటిగట్టు సమీపంలోని రాయంచెరువు వద్ద గురువారం రాత్రి చిరుతపులి మృతి చెందినట్లుగా గ్రామస్తులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ సెక్షన్…

TG : ఆన్లైన్ లో గంజాయి చాక్లెట్ల విక్రయం.. అరెస్ట్

ఆన్లైన్ లో జరుగుతున్న గంజాయి చాక్లెట్ల బిజినెస్ ను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్బీ) డైరెక్టర్ సందీప్ శాండిల్యా బృందం గుర్తించింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లో ఉన్న 8 కంపెనీలు ఇండియా మార్ట్ ద్వారా ఆర్డర్ చేస్తే గంజాయి చాక్లెట్లను…

కలరా వ్యాక్సిన్ ల కొరత ఎక్కువగా ఉంది: WHO

ప్రపంచంలోని చాలా దేశాలకు కలరా వ్యాధి వ్యాపించింది. ఆఫ్రికా దేశాల్లో అధిక మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలరా వ్యాక్సిన్ ల కొరత ఎక్కువగా ఉందని.. వాటి ఉత్పత్తి పెంచాలని WHO చీఫ్ టెడ్రస్ అథనోమ్ తయారీదారులకు పిలుపునిచ్చారు. జులై 28…

రాఖీ పౌర్ణమి రోజు ఆకాశంలో ఒక అద్భుత దృశ్యం చోటు చేసుకోనుంది…

ఆగస్టు 19వ తేదీ సోమవారం నాడు పౌర్ణమి కానుంది. శ్రావణ మాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు. అదే రోజు ఆకాశంలో ఒక అద్భుత దృశ్యం చోటు చేసుకోనుంది. అదే సూపర్ బ్లూ మూన్.. ఇది సామాన్య…

గుడ్ న్యూస్… ప్రతీ రైతు కూలీకి ఆర్థిక సాయం… – సీఎం రేవంత్ రెడ్డి

భూమిలేని రైతు కూలీలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ప్రతీ రైతు కూలీకి ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. ఈ సంవత్సరం నుంచే దీన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. భూమిలేని పేదలు కొన్నిసార్లు కూలీ దొరక్క…

ఢిల్లీ : కేజీవాలకు మధ్యంతర బెయిల్ కు సుప్రీంకోర్టు నిరాకరణ

ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజీవాలకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఢిల్లీ మద్యం పాలసీపై సీబీఐ నమోదు చేసిన కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై…

HYD : రైల్వే స్టేషన్లలో ఇకపై QR కోడ్ తో టికెట్లు కొనుగోలు చేయవచ్చు…

రైల్వే స్టేషన్లలో టికెట్ల కొనుగోలు విషయంలో… నగదు, చిల్లర సమస్యలకు చెల్లుచీటీ పడనుంది. ఈ క్రమంలో దక్షిణమధ్య రైల్వే కీలక ముందడుగు వేసింది. జోన్ పరిధిలోని అన్ని స్టేషన్లలో ఇకపై QR కోడ్ తో టికెట్లు కొనుగోలు చేయవచ్చు. జనరల్ బుకింగ్,…

ఆ దేశాధినేతలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

రష్యా, చైనా, ఉత్తర కొరియా అధ్యక్షులపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్తో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘పుతిన్, జిన్పింగ్, కిమ్ జోంగ్ ముగ్గురూ అత్యుత్తమ దశలో ఉన్నారు. వారిని అడ్డుకునేందుకు అమెరికాకు బలమైన…

బెంగళూరులో బస్సు బీభత్సం

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర ప్రమాదం తప్పింది. హెబ్బాల్ ఫ్లై ఓవర్ పై బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఓ బస్సు.. పలు వాహనాలను ఢీకొట్టుకుంటూ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో…

AP : టీచర్ల సర్దుబాటుకు కొత్త మార్గదర్శకాలు

టీచర్ల సర్దుబాటు ప్రక్రియకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం మిగులుగా ఉన్నవారిని తొలుత మండల స్థాయిలో, తర్వాత డివిజన్ స్థాయిలో సర్దుబాటు చేస్తారు. ఈ నెల 14వ తేదీకి ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగంలో…

బంగ్లాదేశీయుల అక్రమ ప్రవేశాన్ని అడ్డుకున్న పోలీసులు

బంగ్లాదేశ్ లో చెలరేగిన హింస, అనంతర పరిస్థితుల దృష్ట్యా వందల మంది భారత్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నిస్తున్నారు. తాజాగా దేశంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను కరీంగంజ్ సెక్టార్ లో అడ్డుకున్నట్లు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎక్స్లో…

ఈ నెల 30 నుంచి OTTలోకి ‘రాయన్’?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రాయన్ మూవీ రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ చిత్రం ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్ దక్కించుకున్నాయి. ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్…

మోదీజీ.. మా దేశానికి రండి: నేపాల్ పీఎం

తమ దేశంలో పర్యటించాలని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి భారత ప్రధాని మోదీని కోరారు. తన ఆహ్వానాన్ని భారత పీఎంకు తెలపాలని నేపాల్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీకి సూచించారు. ప్రచండ హయాంలోని గత సర్కారు…

TG : కబ్జా చేస్తే కాల్ చేయండి : కమిషనర్

హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. గాజులరామారంలోని చింతల చెరువు బఫర్ జోన్తో సహా 44.3 ఎకరాలు, పుల్యాంక్ లెవెల్ పరిధిలో అక్రమంగా 52 నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు.…

మరోసారి ఉత్తమ విద్యాసంస్థగా ‘ఐఐటీ మద్రాస్’

దేశంలోనే ఉత్తమ విద్యాసంస్థగా మరోసారి ‘ఐఐటీ మద్రాస్’ నిలిచింది. ఈ జాబితాలో టాప్లో నిలవడం ఈ సంస్థకు ఇది వరుసగా ఆరో సారి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(NIRF) కింద కేంద్ర విద్యాశాఖ జాబితా రూపొందించింది. ఓవరాల్ టాప్ 10…

TG : భద్రాద్రి మీదుగా కొత్త రైలు మార్గం

కేంద్ర మంత్రివర్గం ఎనిమిది కొత్త రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఒడిశాలోని మల్కనగిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు రూ.4,109 కోట్లతో 200.60కిలోమీటర్ల…

జాతి వ్యతిరేక హింసను సహించం: UNO

జాతి వ్యతిరేక దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఐక్యరాజ్య సమితి(UNO) స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ లో హిందువులతోపాటు మైనారిటీలపై దాడులు ఆందోళనకరమని తెలిపింది. మరోవైపు బంగ్లాలో మైనారిటీలపై దాడులకు అడ్డుకట్ట వేసేలా ఆ దేశంతో కలిసి పని చేసేందుకు భారత ప్రభుత్వం…

పచ్చి మిర్చితో మానసిక ఆరోగ్యం

గ్రీన్ చిల్లీతో కూడా బోలెడు లాభాలు ఉంటాయని చెప్తున్నారు నిపుణులు. పచ్చి మిరపకాయల మంటకు కారణమయ్యే క్యాప్సైసిన్ సమ్మేళనం జీవక్రియ రేటును పెంచుతుంది. బరువును అదుపులో ఉంచడంలో సహాయం చేస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు సహాయం చేస్తుంది. స్పైసీ ఫుడ్…

HYD : బేగంపేట రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు 22.57 కోట్లు కేటాయింపు…

కేంద్రం ప్రభుత్వం రూ.22,57కోట్లు కేటాయించిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచడం, సదుపాయాలను కల్పించడంలో భాగంగా చేపట్టిన ఈ పనులు ఇప్పటికే 50శాతం మేర పూర్తయ్యాయని తెలిపారు. నిర్మాణంలో ఉన్న బేగంపేట రైల్వేస్టేషన్ చిత్రాలను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు.…

జువాలజిస్టు 249ఏళ్ల జైలు శిక్ష!

ఆస్ట్రేలియాలో 60కిపైగా కుక్కలను రేప్ చేసి, చంపినందుకు జువాలజిస్ట్ ఆడమ్ బ్రిటను కోర్టు ఏకంగా 249ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతడు కుక్కలను కొట్టి చంపి, తన క్రూరత్వాన్ని వీడియోలో తీసేవాడట. కుక్కలను హింసించేందుకు అతడు షిప్పింగ్ కంటైనర్ను టార్చర్ రూమ్లో…

ఐరాసలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ

సెప్టెంబరు 24 నుంచి 30 వరకు ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ అంతర్జాతీయ వేదికపై సెప్టెంబరు 26న మోదీ ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఐరాస విడుదల చేసిన…

బ్యాంకింగ్ చట్టాల్లో త్వరలో మార్పులు

అనెక్లెయిమ్డ్ డిపాజిట్ల సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో డిపాజిట్ ఖాతాకు ఇకపై నలుగురు నామినీల సంఖ్యను పెంచడంతో పాటు బ్యాంకింగ్ చట్టాల్లో అనేక మార్పులను ఆమోదించింది. దీనికి సంబంధించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో త్వరలో…

అసోంలో రూ.27,000 కోట్లతో టాటాల చిప్ ప్లాంటు

అసోంలో రూ.27,000 కోట్ల పెట్టుబడితో చిప్ అసెంబ్లింగ్ ప్లాంటును టాటా ఎలక్ట్రానిక్స్ ఏర్పాటు చేస్తోంది. 2025 కల్లా ఈ ప్లాంటు కార్యకలాపాలు మొదలవుతాయని.. దీని ద్వారా 27,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తెలిపారు. ఇతర సెమీకండక్టర్…

TG : ఈ నెలాఖరులో డీఎస్సీ ఫలితాలు

DSC పరీక్షలు సోమవారంతో ముగియనున్నాయి. ఈ నెలాఖరులో ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం ఫైనల్ కీని ఖరారు చేస్తారు. ఆ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేస్తారు. ఒక్కో…

అంతరిక్షంలో అద్భుత నిధి: నాసా

నాసా ఇప్పుడు అంతరిక్షంలో ఒక అద్భుత నిధిని కనుగొంది. 1852లో అన్నీబలే డి గాస్పరిస్ కనుగొన్న గ్రహశకలం16 సైకిపై 140 మైళ్ల వ్యాస పరిధిలో బంగారం, నిఖిల్, ప్లాటినం లోహాలు ఉన్నట్టు కనుగొన్నారు. అంగారక, గురు గ్రహాల మధ్య ఉన్న ఈ…

భారత పౌరసత్వానికి 2.16 లక్షల మంది గుడ్ బై…!

నైపుణ్యం కలిగిన 2.16 లక్షల మంది ప్రముఖులు 2023లో భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాంరమేశ్ తెలిపారు. రాజ్యసభలో కేంద్రమంత్రి కీర్తివర్ధన్సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారన్నారు. విద్యావంతులు, వ్యాపారవేత్తలు భారత పౌరసత్వాన్ని వదులుకుని అమెరికా, బ్రిటన్, సింగపూర్ తదితర…