బస్సుల్లో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను ప్రవేశపెట్టేందుకు RTC కసరత్తు చేస్తోంది.
ఇకపై ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డు స్వైపింగ్ తదితర చెల్లింపు విధానాలతోనూ టికెట్లు జారీ చేయనున్నారు. అందుకు ప్రత్యేకంగా ‘ఆటోమెటిక్ ఫెయిర్ కలెక్షన్ సిస్టమ్ (AFCS)’ వ్యవస్థను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మేరకు 13,200 టికెట్ జారీ యంత్రాలను కొనుగోలు చేయనున్నారు.