మండల-మకరవిళక్కు సీజనులో భాగంగా కేరళలోని శబరిమల ఆలయం తెరచుకుంది. శనివారం తెల్లవారుజాము నుంచి భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు.

తొలిరోజే వర్చువల్ బుకింగ్ ద్వారా దాదాపు 30 వేల మంది భక్తులు నమోదు చేసుకున్నట్లు సమాచారం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ సీజన్ లో దర్శన సమయాలను పొడిగించినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది.