దేశంలో గడిచిన మూడేళ్లలోనే 50 లక్షల వృక్షాలు అంతర్ధానమైనట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. మధ్యభారతం, మహారాష్ట్రలో చెట్ల నరికివేత పెరిగినట్టు తెలిపింది.
వ్యవసాయ భూముల్లో వరి, గోధుమ వంటి పంటలను వేయడానికి వృక్షాలను పెద్ద ఎత్తున నరికేసినట్టు అధ్యయనం పేర్కొంది. సాగు భూముల్లో భారీ వృక్షాల నరికివేత తెలంగాణలోనూ జరిగినట్టు అధ్యయనం వెల్లడించింది.