తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న యంగ్ ఇండియా సమీకృత గురుకులాల లో ఒక్కో దాంట్లో 2,560మంది విద్యార్థులు ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకోనున్నారు.

తొలి విడత పైలట్ ప్రాజెక్టులో భవనాలు నిర్మించే ప్రాంతాలలో కొడంగల్, హుస్నాబాద్, హుజూర్నగర్, ములుగు, ఖమ్మం, కొల్లాపూర్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, అచ్చంపేట, తిరుమలగిరి, మధిర, నల్గొండ, మంథని, పాలేరు, వరంగల్, అందోలు, భూపాలపల్లి, స్టేషన్ ఘన్పూర్, తుంగతుర్తి ఉన్నాయి.