వాహన తయారీ సంస్థ మారుతి సుజుకీ షేర్లు ఈరోజు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 3శాతం మేర పెరిగిన షేర్ విలువ తొలిసారిగా ఈరోజు రూ.12వేల మార్కును టచ్ చేసింది.

మధ్యాహ్నం 12.44 గంటల సమయానికి షేర్ వాల్యూ 3.14 శాతం పెరిగింది. షేర్ విలువ చివరి ఐదు ట్రేడింగ్ సెషన్లలో 5శాతం, గడచిన 6 నెలల్లో 15.5శాతం, గడచిన ఏడాదిలో 45శాతం పెరగడం విశేషం.