ఈ నెల 27 నుంచి మరో రెండు గ్యారంటీలను అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను చేవెళ్లలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ ప్రారంభిస్తారని తెలిపారు.

డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలను త్వరలోనే అందిస్తామన్నారు. గిరిజనులకు పోడు పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.